హోంపేజి
కృష్ణాజిల్లాకు చెందిన ఒక తెలుగు కుటుంబంలో పుట్టిన గద్దె సింధూర మిస్-ఇండియా వరల్డ్ పోటీ ద్వారా రెండేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. న్యూజీల్యాండ్లో న్యూస్ యాంకర్గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఒక హిందీ సినిమాలో నటించనుంది. విదేశాల్లో పుట్టి పెరిగినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడే సింధూరకు తెలుగు సినిమా రంగం నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే రూపాయికీ డాలరుకూ చాలా తేడా ఉండడంతో నిర్మాతలు వెనుకాడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆమె బాలీవుడ్ ప్రముఖుడు బి సుభాష్ నిర్మించనున్న ఝూమ్ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమాకు సుభాష్ కుమార్తె శ్వేత దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో సింధూర మధ్య తరగతి భారతీయ యువతిగా నటించబోతోంది. లండన్లో జరిగే డ్యాన్స్ పోటీలో పాల్గొనాలని, ఇంగ్లాండ్లో స్ధిరపడిన తండ్రిని చూడాలని ఈ సినిమాలో సింధూర ఆరాటపడుతుంటుంది.
ఎవరీ
ముళ్ళపూడి
రేణుక?
ఈసారి
చిరంజీవి
జన్మదినోత్సవం
విభిన్నం