ఒకప్పుడు
తెలుగు
ప్రేక్షకులను
ఉర్రూతలూగించిన
మనీషా
కొయిరాలా
ఇప్పుడు
ముంబయ్లో
గోళ్ళు
గిల్లుకుంటూ
కూర్చోవడం
లేదు.
ప్రస్తుతం
రెండు
హిందీ
సినిమాల్లో
నటిస్తున్న
ఆమె
పనిలో
పనిగా,
కొన్ని
వేల
కోట్ల
విప్రో
సామ్రాజ్యానికి
యువరాజైన
తారిఖ్
ప్రేంజీని
ఆమె
ప్రేమ
ముగ్గులోకి
దించినట్టు
తెలిసింది.
ఒక
భూస్వామితో
కొంత
కాలం
ప్రేమాయణం
నడిపిన
మనీషా
ఆయనను
పూర్తిగా
కట్
చేసుకుని
తారిఖ్తో
కలిసి
ముంబాయిలోని
హోటళ్లకు,
రిసార్ట్స్కు
వెళ్తున్నట్టు
ముంబాయి
పత్రికలు
రాశాయి.
నిజానికి
తారిఖ్
కంటే
మనీషా
వయసులో
పెద్దది.
ప్రేమకు
పెద్దా
చిన్నా
ఏముంటాయి?
అయితే
తారిఖ్
తనకు
మంచి
స్నేహితుడు
మాత్రమేనని,
తమ
మధ్య
ప్రేమాయణం
లేదని
మనీషా
ఖండిస్తోంది.
కొయిరాలాలు,
ప్రేంజీలు
ఫ్యామిలీ
ఫ్రెండ్స్
అని
ఆమె
చెబుతోంది.
మనీషా
నేపాల్
రాజధాని
ఖాట్మండులో
ఒక
రాజకీయ
కుటుంబంలో
1970లో
పుట్టింది.
అమె
తాత,
మరికొందరు
సమీప
బంధువులు
నేపాల్
ప్రధాన
మంత్రులుగా
ఒక
వెలుగు
వెలిగారు.
తారిఖ్తో
తన
ప్రేమాయణాన్ని
ఆమె
ఖడిస్తున్నప్పటికీ
ఏ
బుర్రలో
ఏ
ప్లాను
ఉందో
ఎవరికి
తెలుసు?
విజయశాంతి
నాయుడమ్మ
త్వరలో
బాలకృష్ణ
సినిమాకు
విలన్
జీవి
కథ!