తెలుగుదేశం హయాం
తెలుగుదేశం హయాంలో ఆ పార్టీ నాయకుల అక్రమ సంబంధాలు అత్యంత గోప్యంగా ఉండేవి. పోలీసులకు తద్వారా పత్రికలకు ఆ అక్రమ సంబంధాల గురించి తెలిసినా పత్రికల్లో ఆ వార్తలు వచ్చేవి కావు. ఇప్పుడు కొన్ని పత్రికలు కాంగ్రెస్ నాయకుల తెరచాటు వ్యవహారాలను బట్ట బయలు చేస్తున్నాయి. నిజామాబాద్కు చెందిన ఒక సీనియర్ మంత్రి గారి కుమారుడు, మేయర్ అయిన ఒక కాంగ్రెస్ యువ నాయకుడు హైదరాబాద్ శివారులోని ఒక ఫాంహౌస్లో రాసలీలలు నడుపుతుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆయన తండ్రి పేరు తెలుసుకున్న పోలీసులు భయపడి అతని మీద కేసు పెట్టకుండా వదిలేశారు. ఈ విషయం పోలీసు వర్గాల ద్వారా పత్రికలకు ఎక్కింది. విశాఖ జిల్లా పరవాడ శాసన సభ్యుడు (కాంగ్రెస్) గండి బాబ్జీ రెండో పెళ్ళి చేసుకోవడంపై గత అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ దుమారం సద్దుమణగక ముందే హైదరాబాద్ సోమాజీగుడాలో ఉండే మంజులా రెడ్డి అనే మహిళతో ఆయనకు సంబంధాలు ఉన్న విషయం ఆమె హత్యకు గురైన తర్వాత పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. బాబ్జీ హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవారన్న విషయం కూడా తెలిసింది. ఈ విషయం బయటికి పొక్కిందని తెలుసుకున్న బాబ్జీ ఎవరూ పత్తిత్తులు కారని, దొరకనంత వరకు అందరూ దొంగలేనని మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.