హోంపేజి
తెలుగు సినిమా రంగంలో నెంబర్ వన్గా వెలుగుతున్న త్రిషకు ఇలియానా థ్రెట్గా మారిన విషయం తెలిసిందే. తన కెరియర్ను కాపాడుకోడానికి త్రిష రకరకాల ఎత్తులు వేస్తోంది. దీనికి చిన్న ఉదాహరణ ఈ ఉదంతం. భారీ నిర్మాత ఎంఎస్ రాజు ఇప్పుడు తీస్తున్న ఆటలో మలయాళ హీరోయిన్ మమతా మోహన్ దాస్ను ఎంపిక చేసుకున్నారు. బాస్ దర్శకుడు విఎన్ ఆదిత్య డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో సిద్ధార్ధ హీరో. అయితే రాత్రికి రాత్రి మమతా మోహన్ దాస్ను వద్దనుకుని నిర్మాత ఇలియానాను తీసుకున్నారు. దీనికి కారణం మమతా మోహన్దాస్ కన్నా యువతరం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉన్న ఇలియానా ఉంటే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా నిర్మాతపై ఒత్తిడి చేయడమే అని తెలుస్తోంది.
నిజానికి ఇలియానా డాన్ చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే ఆమెను వెనక్కి నెట్టి త్రిష హీరోయిన్గా ముందుకు వచ్చింది. నాగార్జున, లారెన్స్ రాఘవ కాంబినేషన్లో వచ్చిన మాస్ చిత్రం విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో, ఇందుకోసం త్రిష తన పారితోషికాన్ని కూడా భారీగా తగ్గించుకుని ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు సమాచారం. తెలుగులో అగ్ర స్ధానాన్ని నిలుపుకోవడంలో భాగంగా త్రిష ఆంధ్రప్రదేశ్లో రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు త్రిషతో అభిమానులు ఫోటోలు దిగడం కష్టమే. వారు రక్తదానం చేసి, ఆ సర్టిఫికెట్ను చూపిస్తేనే ఆమె వారితో ఫోటోలు దిగడానికి సిద్ధమవుతోంది. పిట్టకొంచెం మోత ఘనం అంటే ఇదేనేమో.
నవనీత్
కౌర్
సెక్స్
పాఠాలు!
నయనతార
రోజు
ఖర్చు
20
వేలు
మాత్రమే!