హోంపేజి
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాదా? ఆయన పూర్వీకులు శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి నుంచి కరీంనగర్ జిల్లాకు వలస వచ్చారని రాష్ట్ర మంత్రి, కరీంనగర్ జిల్లా వాసి ఎం సత్యనారాయణ రావు సెలవిచ్చారు. సినీనటి విజయశాంతి విషయంలో కూడా ఈ వివాదం ఉంది. ఆమె పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వరంగల్ జిల్లాకు వలస వచ్చారని రికార్డులను బట్టి తెలుస్తోంది. ఆమె నా తెలంగాణ అనడం తెలంగాణ ఛాందస వాదులకు నచ్చడం లేదు. బొబ్బిలి నుంచి వలస వచ్చిన చంద్రశేఖరరావుకు ఇప్పటికీ సన్నిహిత సహచరులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే. చెన్నారెడ్డి లాగా ఆయన స్పిరిటెడ్గా పని చేయలేకపోవడానికి కారణం కెసిఆర్ మూలాలు ఆంధ్రలో ఉండడమేనన్న విమర్శ ఉంది. ఉన్న విషయాన్ని ఉన్నట్టు మాట్లాడే సత్యనారాయణ రావు ఆరోపణకు చంద్రశేఖరరావు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తాను కూడా నల్గొండ జిల్లా నుంచి కరీంనగర్ జిల్లాకు వలస వచ్చానని ఎంఎస్ చెప్పడం కొసమెరుపు. నిన్న మొన్నటి వరకు గట్టి తెలంగాణ వాది అయిన పిసిసి అధ్యక్షుడు కే కేశవరావు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్కు వలస వచ్చారని టిఆర్ఎస్ నేత నరేంద్ర ఆరోపించడం మరో విశేషం.
ఈ
మీడియాకు
ఎందుకింత
తుత్తర?
సింగపూర్
టౌన్షిప్లో
ఫ్లాట్
బెస్ట్బై