వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరమంతా తిరిగిన చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews


Chiranjeevi ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ "చిరుత" సినిమానే. ఈనెల 28న విడుదల కానున్న ఈ సినిమా నిన్న సెన్సార్ ముందుకు వెళ్ళింది. చిరంజీవి నిన్న నగరమంతా తిరిగి "చిరుత" పోస్టర్ల తీరుతెన్నులను పరిశీలించి, అవసరమైన మార్పులు సూచించినట్టు తెలిసింది.

"చిరుత" దర్శకుడు పూరీ జగన్నాధ్ తీసిన అనేక సన్నివేశాలను చిరంజీవి రీ షూటింగ్ చేయించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనితో పూరీ మనస్ధాపం చెందినట్టు ఫిల్మ్ నగర్ లో గుప్పుమంది. కానీ నిన్న సినిమా చూసి చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఆయన చేసుకున్న మార్పులు ఆయనకు నచ్చకుండా ఎలా ఉంటాయి?

"చిరుత" తర్వాత చరణ్ తేజ మరో రెండు సినిమాల్లో నటించనున్నాడు. ఒకటి గీతా ఆర్ట్స్ చిత్రం కాగా మరొకటి అశ్వనీదత్ బ్యానర్ ది. గీతా ఆర్ట్స్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించబోతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X