వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీకల్లోతు కష్టాల్లో వైఎస్ సర్కారు

By Staff
|
Google Oneindia TeluguNews


Rajasekhar Reddy ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇప్పుడు నిజంగా సూపులో పడ్డారు. వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆయన సర్కారును పీకలలోతు కష్టాల్లోకి నెట్టి వేస్తున్నాయి. గతవారం ఆయనను ఇబ్బంది పెట్టే మూడు సంఘటనలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి దంపతులపై నెల్లూరు జిల్లాలో హత్యాయత్నం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమన్న విమర్శలు వెల్లువెత్తాయి.

నిన్న పిసిసి అధ్యక్షుడు కేశవరావు కుమారుడు వెంకట్ తన వ్యాపార భాగస్వామి ప్రశాంత్ రెడ్డిని కాల్చి చంపినట్టు ఆరోపణలు ఉన్నా, వెంకట్ ను ఇంకా అరెస్టు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని పోలీసులు రక్షిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఆదివారం రాత్రి పంజాగుట్టలో నిర్మాణంలో ఉన్న ఫ్లైవోవర్ కూలిపోవడం, ఐదుగురు మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం పనులను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు చుట్టు ముట్టాయి. వేలాది కోట్ల రూపాయల లంచాలు తీసుకుని ఇచ్చిన ఇరిగేషన్ కాంట్రాక్టుల పర్యవసానంగా నీటిపారుదల ఆనకట్టలు కూలిపోతాయేమోనన్న అనుమానాలను కాంగ్రెస్ నాయకులే వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X