వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షిపై ఆంధ్రజ్యోతి దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
ముఖ్యమంత్రి వైఎస్ ముద్దుల కుమారుడు జగన్ ముచ్చట పడి పెట్టుకున్న పత్రిక విపరీతమైన నష్టాల్లో కూరుకుపోవడం ప్రత్యర్ధులకు దాడి చేసే అవకాశం కల్పించింది. అన్నీ రంగుల పేజీలతో రెండు రూపాయలకే పత్రికను అందించిన ఆయన నిన్న చేతులెత్తేసి, పత్రిక ధరను రెండున్నర చేసినట్టు ప్రకటించారు. అనేక కారణాల వల్ల ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడం వల్లనే ఈ పరిస్ధితి ఏర్పడినట్టు తెలుస్తోంది.

దీనిపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం నేడు రెచ్చిపోయింది. గత ఏప్రిల్ లో సాక్షి పత్రిక ప్రారంభమైనప్పుడు రెండు రూపాయలకే పత్రిక ఇస్తున్నామని, మిగితా పత్రికలు కూడా రెండు రూపాయలకే పత్రిక ఇవ్వాలని సాక్షి ఒక నెల పాటు ఒక ఉద్యమం చేసింది. దానిని ఆక్షేపిస్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నేడు ఎడ్వటోరియల్ రాసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X