హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు పిరికితనం!

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చంద్రబాబు నాయుడు మానసిక పిరికితనం శ్రీనివాస్ యాదవ్ ఉదంతంలోనూ బయటపడింది. ఈ మధ్య చాలా మంది తెలుగుదేశం నాయకులు చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ పార్టీలో లేపిన తుఫాను సద్దుమణిగింది. పార్టీ ప్రత్యేక తెలంగాణ వాదాన్ని సమర్థించడాన్ని నిరసిస్తూ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో గురువారం రెండున్నర గంటల పాటు పార్టీ అధినేత భేటి అయ్యారు. బహిరంగంగా తన వాదనను వినిపించడంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తలసానిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో సుదీర్గంగా జరిగిన చర్చలతో తలసాని వివాదం సద్దుమణిగింది.

ప్రత్యేక రాష్ట్ర వాదన సున్నితమైన విషయం. సీనియర్‌ నాయకుడిగా ఉండి బహిరంగంగా మాట్లాడటం తప్పని చంద్రబాబునాయుడు అన్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ వాదంపై మాట్లాడొద్దు. ప్రజా సమస్యలపై ఇప్పుడు పోరాడుదాం..అని చంద్రబాబు తలసానితో చెప్పినట్లు సమాచారం. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరతానంటూ వచ్చిన మీడియా కథనాలకు తాను బాధ్యున్ని కాదని తలసాని వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X