వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుల సభల్లో చిరు వ్యాఖ్యలు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
రాజకీయాల్లో కులం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు. కులమే నేడు సామాజిక సత్యంగా మారింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి నిన్న రెండు కుల సంఘాల సమావేశాల్లో ప్రధాన అతిధిగా పాల్గొని ప్రసంగించారు. నిన్న సికింద్రాబాద్ లో జరిగిన ఆర్యవైశ్య సదస్సులో పాల్గొన్న చిరంజీవి "దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీ వైశ్యుడు కావడం ఆర్య వైశ్యులందరికీ గర్వ కారణమ'ని చెప్పారు.

నిన్న రాత్రే కుకట్ పల్లిలో జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడిన చిరంజీవి ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే బ్రాహ్మణ ఆర్ధిక సహాయ సంస్ధను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమాజంలో బ్రాహ్మణులు ఆర్ధికంగా బాగా అణగారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మూడు ప్రధాన కులాలకు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర కులాలను కలుపుకుని పోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కమ్మ కులానికి, వైఎస్ రెడ్డి కులానికి, చిరంజీవి కాపు కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X