హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసీఆర్ కు ఆంధ్రాయే ఇష్టమా?

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ మహా నాయకుడు కెసీఅర్ ఇష్టపడే ఆహారమేమిటి? ఆంధ్రా చేపల పులుసా? ఆంధ్రా రొయ్యల ఇగురా? లేదంటే తెలంగాణ సామాన్య ప్రజలు తినే పొట్టేలు తినే ఆహారం తీసుకుంటారా?

నెక్లెస్ రోడ్డులోని మోక్ష రెస్టారెంట్ లో జరుగుతున్న ఆంధ్రా పుఢ్ పెస్టివల్ లో తెలంగాణ ప్రాంతీయుల మనోభావాలను దెబ్బతీసేలా హోర్డింగ్ లు పెట్టారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం గొడవ చేయడంతో రెస్టారెంట్ యాజమాన్యం దిగివచ్చింది. హోర్డింగ్ లు తొలగించేందుకు అంగీకరించటంతో వివాదం సర్దుమణిగింది. వివరాల్లోకి వెళితే..మోక్షా రెస్టారెంట్ లో ఈ నెల మూడు నుంచి ఆంధ్రా పుడ్ పెస్టివల్ జరుగుతోంది. 19వరకూ జరిగే ఈ ప్రత్యేక వ్యాపార కార్యక్రమానికి గాను రెస్టారెంట్ యాజమాన్యం ఆకర్షణీయమైన హోర్డింగ్ లు ఏర్పాటు చేసింది. ఐతే ఆ హోర్డింగ్ లలో "తెలంగాణ హీరోస్ లవ్స్ అవర్ పుడ్" అనే రాతలతో పాటు కేసీఆర్ కేరికేచర్ వేశారని, ఇది తెలంగాణ ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు ఆంధ్రాపుడ్ పెస్టివల్ లో తెలంగాణ మాట ఎందుకు వచ్చిందంటూ విరుచుకుపడ్డారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం చేసేది లేక హోర్డింగ్ లను తొలిగించేందుకు నిర్ణయించింది.

గతంలో ఎన్నో సార్లు తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్స్, రాయలసీమ ఫుడ్ ఫెస్టివల్స్ జరిగాయి. ఇప్పుడు ఆంధ్రా ఫుడ్ ఫెస్టివల్ అనగానే కొందరు పెద్ద ఇష్యూ చేయడం చర్చనీయాంశమౌతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X