వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీ 'రాయబేరం'!

By Santaram
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
ముసలాయనకు దసరా పండుగ లాగా ఉంది ముఖ్యమంత్రి రోశయ్య వ్యవహారం. కనీసం రెండు మూడేళ్ళు ఆయన సిఎంగా కొనసాగే అవకాశాలున్నాయి. మీడియా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా తాత్కాలిక ముఖ్యమంత్రిగానే చూడడంపై రోశయ్య బాధగా ఉన్నట్టు తెలుస్తోంది. సొంతంగా ఒక టీవీ చానల్ పెట్టుకోమని రోశయ్యకు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకు కావలసిన నిధులను ఆ శ్రేయోభిలాషులే సమకూర్చుతారట.

ఈ విషయం తెలుసుకున్న రామోజీరావు రోశయ్యకు ప్రచారం కల్పించడానికి ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు. రోశయ్యను వ్యక్తిగతంగా కలిసి వైఎస్ హయాంలో తనను ఎలా వేధించిందీ వివరించనున్నట్టు తెలిసింది. పరస్పరం సహకరించుకునే విధంగా ఉభయుల మధ్య అంగీకారం కుదిరే అవకాశముంది. అయితే రామోజీరావంటే రోశయ్యకు కొన్ని భయాలు ఉన్నాయి. పబ్లిసిటీ కోసం ఆశపడితే ఉన్న గోచీ ఊడిపోతుందనే భయం ఆయనది.

మరో వైపు కెసీఅర్ తన సొంత చానల్ ను ప్రారంభించే యోచనలో ఉన్నారు. అందుకోసం ఆయన ఇప్పటికీ సీనియర్ జర్నలిస్టులతో మంతనాలు సాగిస్తున్నారు. తెలంగాణ జర్నలిస్టులను మాత్రమే కొలువుల్లోకి తీసుకుని, రవి ప్రకాష్ వంటి ఆంధ్రా జర్నలిస్టులను సలహాదారులుగా పెట్టుకోవాలని ఆయన చూస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X