వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ భార్య విజయలక్ష్మికి మంత్రి పదవి?

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayalakshmi
హైదరాబాద్: వైయస్ సతీమణి విజయలక్ష్మి పులివెందుల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆమెకు రాష్ట్రమంత్రి వర్గంలో స్ధానం కూడా లభించవచ్చు. ఈ డిసెంబర్ ఏడో తేదీ నుంచి 13 రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగిన తరువాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నారు. తనను సిఎల్పీ నేతగా ఎంపిక చేసినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపేందుకు రోశయ్య రెండో తేదీన ఢిల్లీ వెళుతున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి ప్రముఖ నాయకులందరినీ కలుస్తారు. విజయలక్ష్మిని మంత్రి వర్గంలోకి తీసుకుంటే వైయస్, జగన్ వర్గీయులకు కళ్ళెం వేసినట్టు అవుతుందని రోశయ్య ఆలోచన. అదే విషయాన్ని ఆయన హైకమాండ్ ముందు ఉంచనున్నారు.

గతంలో వైయస్ తో పొసగక పదవులకు దూరంగా ఉండిపోయిన వారంతా ఇప్పుడు రంగంలోకి దిగారు. మొత్తం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని, సమర్ధతకు, విధేయతకు రోశయ్య పెద్ద పీట వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులందరి చేతా రాజీనామాలు చేయించాలని కూడా రోశయ్యకు వారు సూచిస్తున్నారు. 'మంత్రి వర్గంలో లేని బయట వ్యక్తులకు విధేయత ప్రకటిస్తున్న వారిని' తొలగించాలని కూడా వారు కోరుతున్నారు.

అయితే ప్రస్తుత మంత్రి వర్గంలో ఎవరినీ తప్పించరారదని కడప ఎంపీ జగన్, కేవీపీల నుంచి కూడా రోశయ్యకు వత్తిడి పెరిగింది. మొన్న సిఎల్పీ సమావేశానికి వచ్చిన కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్పమొయిలీ కూడా రోశయ్యకు, డి శ్రీనివాస్ తో పాటు జగన్, కేవీపీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపధ్యంలో పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ కలిగించే అంశమే. ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేయరాదని జగన్ డిమాండ్ చేసినప్పుడు కేంద్రమంత్రులు జోక్యం చేసుకున్నారని, అన్ని పరిస్థితులను పరిశీలించే రోశయ్య నిర్ణయం తీసుకుంటారని చెప్పినట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X