వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కొమరం పులి ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి వస్తారని ఆయన అభిమానులు ఆశించి భంగపడ్డారు. ఆ ఫంక్షన్ కు రాలేనంత బిజీగా చిరంజీవి లేరు. తమ్ముడు తనంత తానుగా ఎదగాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. తన అభిమానులు కాకుండా పవన్ అభిమానులు ప్రత్యేకంగా ఏర్పడాలని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. కానీ రోశయ్యను ఆ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా పిలిచినందువల్లనే ఆయన ఆ ఫంక్షన్ కు రాలేదని మరో కథనం. చిరంజీవి ఒక ఎమ్మెల్యే మాత్రమే. రోశయ్య ముఖ్యమంత్రి. ఆ ఫంక్షన్ కు తాను హాజరైతే తక్కువగా కన్పిస్తానని చిరంజీవి అనుకున్నట్టు ఆంతరగిక వర్గాలు చెబుతున్నాయి. పైగా సోనియాగాంధీ ఇచ్చిన హామీల కారణంగా చిరంజీవి ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ఐపోయినట్టు ఫీల్ అవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కు ప్రజారాజ్యం అనుభవంతో రాజకీయాలపై విరక్తి పుట్టి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన, అందరూ బాగుండాలనే కోరిక గల పవన్ కు కుళ్ళు రాజకీయాలు పడకపోవడంలో ఆశ్చర్యం లేదు. అన్న ప్రజారాజ్యం స్ధాపించినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో పవన్ క్రియాశీలక పాత్ర వహించాడు. చివరికి అన్న కూడా పవర్ పాలిటిక్స్ వైపు మరలడం అతనికి బాధ కలిగించి ఉంటుంది. మధ్యలో అల్లు అరవింద్ పాత్ర కూడా అతనికి మనస్ధాపం కలిగించి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X