వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఎన్నికల్లో యుద్ధం చిరంజీవి, చంద్రబాబు మధ్యనే

By Santaram
|
Google Oneindia TeluguNews

చిరంజీవి బాగా బరువెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన మొహం బాగా ఉబ్బిపోయి అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. బరువు తగ్గడానికి ఆయన కేరళ వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక్కడ రాజకీయంగా వెలితి ఉండడంతో ఆయనకు తన శరీర ఆరోగ్యం విషయంలో సమయం దొరికింది. వచ్చే ఎన్నికల్లో అయినా చిరంజీవి రాణిస్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

చిరంజీవి అభిమానులు ఆయనను హీరోగా చూడాలనుకుంటున్నారు కానీ రాజకీయ నాయకుడిలా కాదు. ఆయన ఇమేజ్ రాజకీయ నాయకుడి కంటే తక్కువని అభిమానుల ఉద్దేశం. అందువల్లనే గత ఎన్నికల్లో ఆయన అభిమానులు క్రియాశీలక పాత్ర తీసుకోలేదు. అలాగే ఆయన సామాజిక వర్గమైన కాపులు కూడా ఆయన కోసం పెద్దగా ముందుకు రాలేదు. ఆ సమయంలో కాపులు వైఎస్ ను గాఢంగా నమ్ముకున్నారు. చిరంజీవి కంటే వైఎస్ ఎక్కువ అని భావించారు.

ఇప్పుడు వైఎస్ లేని రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఆయన సమైక్యాంధ్ర వైఖరి తీసుకోవడం, తెలంగాణపై సంప్రదింపులు చివరి స్ధాయికి చేరడం సందేహాలకు తావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలో ఆయన ప్రధాన భూమిక వహిస్తారనడంలో సందేహం లేదు. అక్కడ చంద్రబాబు పోరాటం చేయాలిసింది చిరంజీవి మీదనే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X