వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వచ్చే ఎన్నికల్లో యుద్ధం చిరంజీవి, చంద్రబాబు మధ్యనే
చిరంజీవి అభిమానులు ఆయనను హీరోగా చూడాలనుకుంటున్నారు కానీ రాజకీయ నాయకుడిలా కాదు. ఆయన ఇమేజ్ రాజకీయ నాయకుడి కంటే తక్కువని అభిమానుల ఉద్దేశం. అందువల్లనే గత ఎన్నికల్లో ఆయన అభిమానులు క్రియాశీలక పాత్ర తీసుకోలేదు. అలాగే ఆయన సామాజిక వర్గమైన కాపులు కూడా ఆయన కోసం పెద్దగా ముందుకు రాలేదు. ఆ సమయంలో కాపులు వైఎస్ ను గాఢంగా నమ్ముకున్నారు. చిరంజీవి కంటే వైఎస్ ఎక్కువ అని భావించారు.
ఇప్పుడు వైఎస్ లేని రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఆయన సమైక్యాంధ్ర వైఖరి తీసుకోవడం, తెలంగాణపై సంప్రదింపులు చివరి స్ధాయికి చేరడం సందేహాలకు తావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలో ఆయన ప్రధాన భూమిక వహిస్తారనడంలో సందేహం లేదు. అక్కడ చంద్రబాబు పోరాటం చేయాలిసింది చిరంజీవి మీదనే.
Comments
Story first published: Saturday, February 13, 2010, 15:59 [IST]