వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ మీడీయా ప్రైవేట్ లిమిటెడ్!

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
ఎట్టకేలకు తెలంగాణకు టీవీ చానల్ వచ్చింది. రాజ్ న్యూస్ ను టీఅర్ ఎస్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చానల్ కు ప్రధాన యాంకరీమణిగా ఎంపీ విజయశాంతి ఉంటారట. సాక్షి టీవీకి స్వప్న ఉన్నట్టే ఇక్కడ రాములమ్మ దర్శనమివ్వబోతోంది. కెసిఆర్ తో విభేదాలు, మళ్ళీ కలవడాలు రాములమ్మకు మామూలై పోయాయి. మొత్తానికి సినిమాలకు దూరమైన ఆమెకు కెసిఆర్ తన టీవీ ద్వారా మంచి వ్యాపకం కల్పించబోతున్నారు. ఈ చానల్ 25 నుంచి ప్రాంరంభం కాబోతోంది. ఈ చానల్ కోసం ఇతర చానళ్ళలో ఉన్న తెలంగాణ టీవీ జర్నలిస్టులను సంప్రదిస్తుండగా వారు రెట్టింపు జీతాలు అడుగుతున్నట్టు సమాచారం.

అంటే యాభై వేలు డ్రా చేస్తున్నవాళ్ళు లక్ష అడుగుతున్నారట. అంత ఇస్తేనే పదునుగా పనిచేస్తారని కెసీఅర్ భావిస్తున్నట్టు సమాచారం. కాగా టీవీ చానల్ సలహా దారుగా టీవీ 9 రవిప్రకాష్ ను పెట్టుకుంటానని గతంలో టీవీ ముఖంగా ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు మరో టీవీ చానల్ న్యూస్ హెడ్ ను కన్సల్టెంట్ గా పెట్టుకున్నట్టు సమాచారం. త్వరలో రానున్న తెలంగాణ దినపత్రికకు ఎడిటర్ ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పెద్ద పెద్ద పేర్లు విన్పిస్తున్నప్పటికీ కెసిఆరే ఎడిటర్ గా పేరు వేసుకుని, నలుగురు అసోసియేట్ ఎడిటర్లను పెట్టుకుంటారని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X