వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముదురుతున్న జగన్, రోశయ్య జగడం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
రోశయ్య ముఖ్యమంత్రిగా బలపడుతున్న కొద్దీ వైయస్ జగన్ వర్గం మరింత ముందుకు రావాలని చూస్తున్నట్టు కన్పిస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తున్న వైయస్ జగన్ రోశయ్య ప్రభుత్వంపై కొన్ని సార్లు ప్రత్యక్షంగా కొన్ని సార్లు పరోక్షంగా విమర్శలు కురిపిస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా గిరిజన మహిళలకు ఇస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాపై జగన్ విమర్శలు కురిపించడంతో రోశయ్య మనస్ధాపం చెందారు. 2008 లో వైయస్ హయాంలోనే ఆ టీకాపై నిర్ణయం తీసుకున్నారని రోశయ్య వెల్లడించడంతో జగన్ వర్గం మౌనం వహించక తప్పలేదు.

రాజును చూసిన కళ్ళతో మొగుడ్ని చూస్తే మొత్త బుద్ధి అవుతుందట. అలా ఉంది వైయస్ జగన్ అనుచరుల వ్యవహారం. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ జగన్ అనుచరులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవాలంటే జగన్ కు సేవ చేసుకోవాలన్న ధోరణిలో వీరు ఉన్నారు. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను 'పిసినారి" రోశయ్య సరిగా అమలు చేయడం లేదన్న బాధ వారిలో ఉంది. కానీ ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో, రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైన స్ధితిలో రోశయ్య తన పరిధిలో చేయగలిగింది చాలా తక్కువన్న విషయాన్ని గ్రహించాలి. ఏమైనా రోశయ్యకు ముందున్నది ముసళ్ళ పండగేమోననిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X