నిత్యానంద కోసం ప్రత్యేక జైలు గది!
ఇలా ఉండగా రాసలీలల స్వామి కోర్టులో కూడా తనదైన శైలిలో నటించారు. రుద్రాక్ష మాలను సిఐడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని దీనిని తనకు తిరిగి ఇప్పించాలంటూ మొరపెట్టుకున్నారు. ఆయన మొర ఆలకించిన న్యాయమూర్తి అసలు ఈ రుద్రాక్ష మాలను ఎందుకు స్వాధీనం చేసుకు న్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. రుద్రాక్ష మాల ద్వారా ఏదైనా ముప్పు కలుగవచ్చునన్న భయంతోనే ఈ మాలను స్వాధీనం చేసుకున్నామని వివరణ ఇచ్చారు.
ఈ మాలలో ఏదైనా మహిమ ఉందో ఏమో తెలియదుగానీ మాలను తిరిగి ధరిస్తూనే స్వామిజీ కోర్టులో ధ్యానం ప్రారంభించారు. కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయారు. దీంతో న్యాయమూర్తి స్వామిజీ ఇది కోర్టు, ధ్యానం చేసుకొనే కేంద్రం కాదంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. న్యాయమూర్తి హెచ్చరిస్తున్నా నిత్యానందుడు కళ్ళుమూసుకొనే తలాడించారు. విచారణ పూర్తయ్యాక పోలీసులు స్వామీజిని భారీ బందోబస్తు మధ్య తిరిగి సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు.