వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్య నెత్తిన మరో బిసీ పిడుగు?

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
చాలా ఆశ్చర్యకరమైన రీతిలో రాష్ట్ర ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ విధానం రూపొందినట్టు తెలుస్తోంది. ఎస్, సి, ఎస్ టి మహిళకు భారీగా రాయితీలు కల్పించనున్నారు. ఈ విధానాన్ని జులై 1న రాష్ట్రమంత్రి వర్గం ఆమోదించనుంది. అయితే బీసీలకు ఎటువంటి రాయితీలను ప్రతిపాదించకపోవడం తీవ్ర విమర్శలకు గురయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి రోశయ్యపై ఇప్పటికే బిసీ వ్యతిరేకి అన్న ముద్ర ఉంది. ఈ విషయంలో కొందరు బీసీ మంత్రులే కేబినెట్ లో వ్యతిరేకించవచ్చు.

ఐటీ పరిశ్రమలు స్ధాపించే ఎస్ సి, ఎస్ టి, మహిళలకు వంద శాతం స్టాంప్‌ డ్యూటీ రియింబర్స్‌ మెంట్ ‌తోపాటు ల్యాండ్‌, పెట్టుబడి, వడ్డీ, విద్యుత్‌ సబ్సిడీలతో కూడిన 2010-15 నూతన ఐటీ పాలసీని రాష్ట్ర మంత్రివర్గం జులై1న ఆమోదించనున్నది. 2005-10 ఐటీ పాలసీ ముగింపు నాటికి రాష్ట్ర ఐటీ ఎగు మతులు రూ. 32,509 కోట్లుగా ఉంటే..ఇది రూ. 70 వేల కోట్లకు దూసుకుపోయే విధంగానూతన ఐటీ పాలసీకి మెరుగులు దిద్దు తున్నట్లు తెలుస్తున్నది. అదే విధంగా ప్రస్తుతం ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 2 లక్షల 50 వేలుగా ఉంటే, కొత్త పాలసీలో దీన్ని అదనంగా లక్షా 50 వేలుగా నిర్ణయించినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X