చిరుకు కలలోకి వస్తున్న వేటూరి!
ముఖ్యమంత్రి అయితే తప్ప మామూలుగా రాజకీయాల్లో కొనసాగితే ప్రజలకు చేసేది పెద్దగా ఉండదని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. సమైక్యాంధ్ర నినాదం విన్పిస్తున్నందున చిరంజీవికి గతంలో వచ్చినన్ని ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు. కోస్తాఆంధ్రలో ఆయన రోడ్ షోలకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నా అవి ఎంతవరకు ఓట్లుగా మారుతాయన్నది సందేహమే. మరో వైపు కాపు ఓట్లను ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. రాజ్యసభకు ఒక కాపు అభ్యర్ధిని ఆయన పంపే అవకాశముంది. పార్టీ సంస్ధాగత నిర్మాణంలో ఈ కులానికి ఇంకా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారు. వైఎస్ లేని కాంగ్రెస్ కోల్పోయే బలాన్ని చంద్రబాబు ఇలా గుంజుకోడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి రాజకీయ అవినీతిపై దండెత్తవలసిన అవసరముంది. ఇలా ఏదైనా బలమైన ఇష్యూని తీసుకోకపోతే చిరంజీవి బలహీనపడిపోయే ప్రమాదముంది.