వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుకు కలలోకి వస్తున్న వేటూరి!

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
చిరంజీవి వేటూరి ఇచ్చిన సలహా ఎంతో గొప్పది. "నువ్వు నందనవనం నుంచి అరణ్యంలోకి వెళ్తున్నావు జాగ్రత్త" అని రాజకీయాల్లోకి చిరంజీవి వచ్చినప్పుడు వేటూరి హెచ్చరించారట. ఆ మహాకవి మరణించినప్పుడు చిరంజీవి స్వయంగా ఈ విషయం చెప్పుకున్నారు. కవి వాక్కులోని విలువెంతో చిరంజీవి తెలుసుకున్నట్టున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నా ఆయన ఏదో వెలితిని అనుభవిస్తున్నట్టుంది. రాజకీయాల్లోకి వచ్చాక సామాజిక కార్యక్రమాలు కూడా బాగా తగ్గిపోయాయి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి పవిత్ర సంస్ధల మీద కూడా ఉమ్మి పడుతోంది.

ముఖ్యమంత్రి అయితే తప్ప మామూలుగా రాజకీయాల్లో కొనసాగితే ప్రజలకు చేసేది పెద్దగా ఉండదని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. సమైక్యాంధ్ర నినాదం విన్పిస్తున్నందున చిరంజీవికి గతంలో వచ్చినన్ని ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు. కోస్తాఆంధ్రలో ఆయన రోడ్ షోలకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నా అవి ఎంతవరకు ఓట్లుగా మారుతాయన్నది సందేహమే. మరో వైపు కాపు ఓట్లను ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. రాజ్యసభకు ఒక కాపు అభ్యర్ధిని ఆయన పంపే అవకాశముంది. పార్టీ సంస్ధాగత నిర్మాణంలో ఈ కులానికి ఇంకా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారు. వైఎస్ లేని కాంగ్రెస్ కోల్పోయే బలాన్ని చంద్రబాబు ఇలా గుంజుకోడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి రాజకీయ అవినీతిపై దండెత్తవలసిన అవసరముంది. ఇలా ఏదైనా బలమైన ఇష్యూని తీసుకోకపోతే చిరంజీవి బలహీనపడిపోయే ప్రమాదముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X