వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడిగితే ఏడ్చేస్తున్న ఐఎఎస్ శ్రీలక్ష్మి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilakshmi
సిబిఐ విచారణలో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి ఏమైనా అడిగితే ఏడ్పు లంకించుకుంటున్నారట. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేసిన శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు మూడు రోజుల కోసం తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ కార్యాలయంలో ఆమెను సిబిఐ అధికారులు విచారించారు. ఆమెకు సిబిఐ కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ గది కేటాయించారు. తాను హృద్రోగిని అంటూ లంకె పెడుతూ ఆమె ఏడుపునే ఆయుధంగా వాడినట్లు తెలుస్తోంది. దాంతో సిబిఐ అధికారులు ఆచితూచి ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

తమ ప్రశ్నలకు ఇబ్బంది పడుతున్న ప్రతిసారీ ఆమెకు వైద్య సేవలు అందిస్తూ విశ్రాంతి ఇస్తూ సిబిఐ అధికారులు ఆమెను ప్రశ్నించారట. అయితే, ఆమె నుంచి సరైన సమాధానాలు రాలేదని చెబుతున్నారు. మొత్తంగా ఆమె విచారణకు సహకరించడం లేదని అంటున్నారు. దీంతో శ్రీలక్ష్మి కస్టడీని పొడగించాలని సిబిఐ కోర్టును అభ్యర్థించే అవకాశాలున్నాయి. అయితే, తీరిక సమయాల్లో శ్రీలక్ష్మి న్యాయశాస్త్ర పుస్తకాలను తిరిగేస్తున్నారని చెబుతున్నారు. తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో మాత్రం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్ అధికారి రాజగోపాల్‌పై నిందలు వేస్తూ తాను తప్పించుకోవడానికి తగిన మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నం చేశారు.

English summary
It is said that IAS officer Srilakshmi is weeping, while she was grilled by CBI in Gali Janardhan Reddy case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X