రాష్ట్రపతికి జగన్ వాడిన డొక్కు కారు!
రాష్ట్రపతికి అధికారులు అతి సాధారణ ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతిభకు కాన్వాయ్తో పాటు స్కార్పియోను కేటాయించారు. అయితే ఆమెకు కేటాయించిన స్కార్పియో బాయ్నెట్ నిండా సొట్టలు పడి ఉన్నాయి. ఈ వాహనాన్ని గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన చిత్తూరు జిల్లా పర్యటనలో వాడారు. ఈ సమయంలో అంది బాగా దెబ్బతిన్నది. అయినప్పటికీ అధికారులు కనీసం మరమ్మతులు చేయించకుండానే కేటాయించారు. వ్యూ మిర్రర్లు పగిలో పోవడంతో వాటిని తొలగించారు. ఆ కారులోనే ప్రతిభ రెండు రోజులు తిరగడం విశేషం. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా ఆమె తన రాష్ట్ర పర్యటన ముగించుకొని ముంబయి వెళ్లారు.
కాగా గురువారం తిరుమలలో ప్రతిభా పాటిల్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. స్వామి సన్నిధిలో గంట సేపు గడిపారు. తన వివాహ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సంగీత కచేరిలో పాల్గొన్నారు. తిరుమలలో సంప్రదాయానికి అనుగుణంగా ప్రతిభా పాటిల్ భర్త దేవీసింగ్ రామ్ సింగ్ షేకావత్తో కలిసి శ్రీ వరాహస్వామిని దర్శించుకున్నారు. పుష్కరణిలో దిగి వందనం చేశారు. పవిత్ర జలాన్ని శిరస్సుపై చల్లుకున్నారు. తిరుమల నుండి సాయంత్రం తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.