వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలులో నిమ్మగడ్డతో అల్లు అరవింద్ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Nimmagadda Prasad - Allu Aravind
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, కేంద్ర మంత్రి చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ హైదారాబదులోని చంచల్‌గుడా జైలులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌ను కలిశారు. ఆ తర్వాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు.

నిమ్మగడ్డ ప్రసాద్ తనకు మంచి మిత్రుడని, అందుకే కలిశానని ఆయన చెప్పారు. ఆయనతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్సి చాముండేశ్వరీనాథ్ కూడా నిమ్మగడ్డను కలిశారు. మాటీవీలో నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున, చిరంజీవిలకు 80 శాతం వాటా ఉంది. ఇందులో 30 శాతం వాటాను సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఏప్రిల్‌లో కొనుగోలు చేసింది. మాటీవీకి నిమ్మగడ్డ ప్రసాద్ చైర్మన్‌గా ఉన్నారు.

మా టీవీ వ్యవహారాల్లోనే అల్లు అరవింద్ నిమ్మగడ్డతో కలిసి ఉండవచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. గతంలో పలు మార్లు సినీ హీరో నాగార్జున కూడా నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిశారు.

ఇదిలావుంటే, చంచల్‌గుడా జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన తల్లి వైయస్ విజయమ్మ, భార్య భారతి, పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కలిశారు.

English summary
Telugu film producer and union minister Chiranjeevi's brother - in - law Allu Aravind met Nimmagadda Prasad alias Matrix Prasad, accused in YSR Congress party president YS Jagan DA case, at Chanchaluguda jail in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X