వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాక్షిగా బాలకృష్ణ సతీమణి వసుంధర
ఎమ్మార్ కుంభకోణం కేసులో పలువురు ప్రముఖులు సాక్ష్యులుగా ఉన్నారు. నాటి పరిశ్రమల శాఖ మంత్రి, ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను సిబిఐ అధికారులు 17వ సాక్షిగా చేర్చారు. గతంలో సిబిఐ ఆయన ఇంటికి వెళ్లి ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని, తన వద్దకు వచ్చిన ఫైళ్లను రొటీన్ పద్దతిలోనే ప్రాసెస్ చేసి పంపించానని బొత్స సిబిఐ అధికారులకు వివరించినట్లు సమాచారం. ఈ కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును 27వ సాక్షిగా, ఎపిఐఐసి ఎండి మీనాను 16వ సాక్షిగా చేర్చారు. కోర్టుకు సమర్పించిన తన ఛార్జీషీట్లో సిబిఐ 286 మందిని సాక్షులుగా విచారించినట్లుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Comments
English summary
CBI named Hero Balakrishna's wife Vasundhara as witness in EMAAR scam.
Story first published: Thursday, February 9, 2012, 10:07 [IST]