వైయస్ జగన్కు సిపిఎం రాఘవులు షాక్
ఎట్టకేలకు, జగన్తో దోస్తీ కట్టే ప్రసక్తి లేదు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు తేల్చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో గానీ తాము కలిసి పనిచేయబోమని రాఘవులు స్పష్టం చేశారు. వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలతో కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించిందని, అయితే తమ నిర్ణయంతో సిపిఐ విభేదిస్తోందని ఆయన చెప్పారు. వామపక్షాల మధ్య ఐక్యతకు ప్రయత్నిస్తామని చెప్పారు.
సిపిఎం మెదక్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై మరింత కాలం వేచి చూడాలన్న కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమని ఆయన అన్నారు. తెలంగాణ విషయంపై ఆయన మాటలను కాసేపు పక్కన పెడితే సిపిఎం మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
వైయస్ జగన్పై అవినీతి ఆరోపణలు తమను ఆత్మరక్షణలో పడేసే ప్రమాదం ఉందని గ్రహించే కాబోలు సిపిఎం వైయస్సార్ కాంగ్రెసుకూ దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచరం. ఏమైనా, వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్కు ఒంటరి పోరు తప్పేట్లు లేదు.