తెరాస అధినేత కెసిఆర్ బిహారీయా?
కానీ 'ఆదికవి నన్నయ్య' అంటూ సినీగేయాన్ని రాసిన సి.నారాయణరెడ్డి కూడా నోరు విప్పకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఆదికవి నన్నయ్య అవతరించిన నేల' అని రాసిన సినారె 'మన తెలంగాణలో రణభేరి మోగింది. ఆంధ్ర సంఘాలు ఊరూరా పెట్టాలి. తెలుగుతల్లికి జేజేలు. తెలుగుతల్లికి కానుకలు అందించాలి' అన్న దాశరథిని కెసిఆర్ కాదనుకుంటారా? 'తేనెతెట్ల నవకంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషామతల్లి' అన్న సురవరం ప్రతాపరెడ్డిని తరిమికొడతారా? అలాంటి రచనలే చేసిన కాళోజీ నారాయణరావును, సుద్దాల హనుమంతును తప్పుపడతారా?'' అని కేసీఆర్ను ప్రశ్నించారు.
వందల ఏళ్లుగా తెలుగు తల్లిని ప్రాంతాలకతీతంగా పూజించి, గౌరవిస్తున్న తెలుగువారి మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 'తెలుగు తల్లికాదు.. తెలుగు దయ్యం' అంటోన్న కెసిఆర్ పూర్వీకులు బీహార్ ప్రాంతం నుంచి బొబ్బిలికి, అక్కడి నుంచి నైజాం ప్రాంతానికి వచ్చినట్లుగా కెసిఆర్ స్వయంగా అంగీకరించారని అడుసుమిల్లి చెప్పారు. దానిని నిరూపించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.
కెసిఆర్ వెంట నడుస్తోన్న కేశవరావు జాదవ్ ఉత్తరప్రదేశ్ నుంచి, తెలంగాణ మేధావి ఫోరం నాయకులు రమా మెల్కోటీ మహారాష్ట్ర నుంచి వచ్చారన్నారు. జయశంకర్ కర్ణాటక ప్రాంతానికి చెందిన వారని, ఆలే నరేంద్ర, దేశపతులు, దేశపాండేలు మరాఠీలని అడుసుమిల్లి అన్నారు. తాజాగా తెరాస ముసుగు కప్పుకొన్న పేర్వారం రాములుది, ఉద్యోగ సంఘాల నేత విఠల్దీ మరాఠీ వారసత్వమేనని చెప్పారు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి తెలుగుతల్లి మీద గౌరవం ఉండదని విమర్శించారు.ఈ విషయాన్ని తెలంగాణలోని తెలుగువారు, తెలుగు భాషాభిమానులు గుర్తించాలని కోరారు.