వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏళ్లకు సీక్రెట్ ఆఫరేషన్: జైల్లో 'తోడు' కోరిన కసబ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajmal Kasab
అజ్మల్ కసబ్‌ను ఉరి తీసినట్లుగా చేసిన ప్రకటన యావత్ భారతదేశాన్నే కాకుండా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కసబ్‌ను ఉరి తీస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ అత్యంత గోప్యంగా అతనిని ఉరికంబం ఎక్కించారు. కసబ్ ఉరి శిక్షకు ఆపరేషన్ ఎక్స్ అని నామకరణం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష తిరస్కరించినప్పటి నుండి ఉరి వరకు అంతా గోప్యత పాటించారు. ఇంత గోప్యంగా ఓ ఆపరేషన్ నిర్వహించడం పోఖ్రాన్-2 తర్వాత కసబ్‌దే!

మే 1998లో నాటి ఎన్డీయే ప్రభుత్వం పోఖ్రాన్-2ను అత్యంత రహస్యంగా పరీక్షించింది. పోఖ్రాన్-2 ప్రయోగించే వరకు ఎవరికీ తెలియదు. ఈ ఆపరేషన్‌ను నాటి ప్రభుత్వం అత్యంత గోప్యంగా పరీక్షించింది. ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. అమెరికా, పాకిస్తాన్‌లో కలవరం పుట్టించింది. దీని తర్వాత అత్యంత గోప్యంగా జరిగిన చాలా ముఖ్యమైన ఆపరేషన్ అజ్మల్ కసబ్‌దే! అంటే 15 ఏళ్ల తర్వాత కేంద్రం మరో పెద్ద ఆపరేషన్‌ను గప్‌చుప్‌గా అమలుపర్చింది.

నవంబర్ 5న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడం, దేవన్ భారతి నేతృత్వంలో 17 మంది అధికారులతో ఆపరేషన్ ఎక్స్ ప్రారంభం కావడం, 7న కేంద్ర హోంశాఖ ఉరి తీయాలని నిర్ణయించుకోవడం, 8న సర్రాకు ఆమోదించడం, ఆ తర్వాత పాక్‌కు, కసబ్ కుటుంబ సభ్యులకు తెలియజేయడం, 19న ముంబయి ఆర్ధర్ రోడ్డు నుండి పూణే ఎరవాడ జైలుకు తరలించడం, 21న ఉరిశిక్ష అమలుపర్చడం అంతా సీక్రెట్‌గా జరిగిపోయింది.

జైలులో ఉన్నప్పుడు కసబ్ విచిత్రంగా ప్రవర్తించే వాడనే విషయం తెలిసిందే. మటన్ బిర్యానీ కావాలని కోరాడు. మొదట అధికారులపై దాడి కూడా చేశాడు. అతను జైలులో ఉన్నప్పుడు పలు కోర్కెలను అధికారుల ముందు పెట్టాడట. అందులో పెళ్లి కూడా ఉంది. ఒక్క గదిలోనే బోర్ కొడుతోందని వేరే గదికి మార్చాలని అధికారులకు మొరపెట్టుకునేవాడు. బాస్మతీ అన్నమైతేనే తింటానని మొండిపట్టు పట్టేవాడు.

అంతేకాదు 2010లో తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడట. ఒంటరితనాన్ని భరించలేక పోతున్నానని, తోడు కావాలని కోరాడట. కాగా అరెస్టు చేసినప్పటి నుండి కసబ్‌కు భద్రత నుండి న్యాయవాదుల వరకు అయిన ఖర్చు దాదాపు యాభై కోట్ల రూపాయలకు పైగా అయిందని అంచనా. కానీ కేంద్రం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రకటించింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఖైదీ కసబ్.

English summary
Ajmal Kasab's Operation X is the secret operation after Pokhran-2!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X