వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయశాంతి మాటలు బిజెపి విని ఉంటే..

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
తెలంగాణలోని ఏకైక శాసనసభా నియోజకవర్గం పరకాలలో పోటీ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి మాటలను విని ఉంటే బిజెపి పరువు దక్కి ఉండేదనే మాట వినిపిస్తోంది. మహబూబ్‌నగర్‌లో తెరాసను ఓడించి ఊపు మీద ఉన్న బిజెపి పరకాలలో అదే ఫలితం సాధిస్తామనే ధీమాతో పోటీకి దిగింది. అయితే, బిజెపి అసలు బలమెంతో పరకాల ఉప ఎన్నికలో తేలిపోయింది.

మహబూబ్‌నగర్ వేరు, పరకాల వేరు అని, పరకాలలో బిజెపి పోటీకి దిగడం సరి కాదని విజయశాంతి ఎన్నికలకు ముందు చెప్పారు. పోటీ నుంచి విరమించుకుంటే బిజెపి పరువుకు దక్కుతుందని కూడా ఆమె చెప్పారు. అయితే, విజయశాంతి మాటలను బిజెపి రాష్ట్ర నాయకులు పెడచెవిన పెట్టారు. పోటీకి దిగి, గెలిచి తీరుతామనే ప్రకటనలు చేశారు. తెరాసను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు.

పరకాల ఓటమి తీరుతో తెలంగాణవాదం బిజెపికి కలిసి రాదనే విషయాన్ని నిరూపించుకున్నట్లు అయింది. ఇక, తెరాసకు, తెలంగాణ జెఎసికి ఎదురు తిరిగి ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి బిజెపి ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని పరకాల ఫలితం కల్పించింది. పరకాలలో కనీసం తెరాసకు బిజెపి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ రెండో స్థానంలో నిలువగా, తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. మూడు స్థానాల్లో బిజెపి ఎక్కడా లేకుండా పోయింది. మహబూబ్‌నగర్‌లో తమకు తెలంగాణ ఓటే పడిందని చెప్పుకోవడానికి కూడా బిజెపికి పరకాల ఫలితం వీలు లేకుండా చేసింది. ఇది బిజెపి స్వయంకృతాపరాధమేనని చెప్పాలి.

English summary

 It is said that BJP should has been heard Telangana Rastra Samith MP Vijayashanthi words on contesting in Parkal assembly segment. It is said that BJP should has been obstain from contest at Parkal seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X