4 నెలలుగా కనిపించని రైలింజన్ దొరికింది
ఈ క్రమంలో ఇంజన్ను గుర్తించమని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ కార్యాలయం నుంచి కాజీపేట డ్రైవర్ల కార్యాలయానికి నోటీసులు అందాయి. ఈ విషయం మంగళవారం మీడియాలో రావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్, మధ్య రైల్వే ముంబయి అధికారులు అన్ని సెక్షన్లలో ఆరా తీయగా... ముంబయి సెంట్రల్ రైల్వేలోని కల్యాణిలో గుర్తించారు. అనంతరం ఇంజన్ను నార్త్ సెంట్రల్ రైల్వే ఝాన్సీ ఎలక్ట్రిక్ లోకోషెడ్కు అప్పగించారు. ఇంజన్ దొరకడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ రైలింజన్ను గుర్తించమని కాజీపేట డ్రైవర్ల కార్యాలయానికి నోటీసులు అందడంతో వారు కాజీపేట రైల్వే స్టేషన్లోని కంట్రోల్ కార్యాలయం నోటీసు బోర్డు పైన ప్రకటన అంటించారు. ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. సాధారణంగా కారు, బైక్ పోయాయని, పిల్లాడు తప్పి పోయాడని వార్తలు వింటుంటాం. కానీ ఏకంగా రైలింజన్ మిస్ అయిందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.