శ్రీలక్ష్మి వైరాగ్యం: కూతుళ్లతోనూ నో ములాఖత్
ఇతర విఐపి ఖైదీలను కలుసుకోవడానికి నిరంతరం బంధువులు, కుటుంబ సభ్యులు వస్తున్నారు. కానీ శ్రీలక్ష్మి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా, తనకు ప్రత్యేక ఖైదీ హోదా ఇచ్చినప్పటికీ అతి సాధారణ జీవితాన్నే ఆమె జైలులో ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఉయం సాయంత్రం వాకింగ్, పత్రికలు, ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం, దైవ ప్రార్థన ఆమె దినచర్యగా మారినట్లు తెలుస్తోంది.
జైలు అధికారులు అందించిన సరుకులతోనే ఆమె వంట చేయించుకుని తింటున్నట్లు కూడా చెబుతున్నారు. ఒఎంసి కేసులో నిందితురాలైన శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు 2011 డిసెంబర్ 1వ తేదీన అరెస్టు చేశారు. చంచల్గుడాలోని మహిళా జైలుకు వచ్చిన ఆమెకు మరుసటి రోజే బెయిల్ లభించింది. దీంతో ఆమె బయటకు వచ్చారు. అయితే హైకోర్టు ఆమె బెయిల్ను రద్దు చేసింది. దీంతో ఆమె 2012 జనవరి 6వ తేదీన కోర్టులో లొంగిపోయారు.
దాంతో ఆమె మళ్లీ చంచల్గుడాలోని మహిళా జైలుకు వచ్చారు. అప్పటి నుంచి ఆమె రెండు సార్లు న్యాయవాదితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భర్త గోపికృష్ణను మాత్రమే ఆమె ములాఖత్లో కలుసుకుంటున్నారట. ఆమె తన ఇద్దరు కూతుళ్లను ఇప్పటి వరకు కలుసుకోలేదని చెబుతున్నారు.