సురేష్ రైనా హర్టయ్యాడు, తిండి మానేశాడు
డ్రెస్సింగ్ రూమ్లో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే రైనాకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడని, టెస్టు జట్టులో స్థానం దక్కనందుకు చాలా బాధపడ్డాడని, తనకు భోజనం చేయాలనిపించడంలేదని సహచరులకు చెప్పి గదిలోనే ఉండిపోయాడని, మ్యాచ్ విజయానంతరం వెంటనే మైదానం వీడి వెళ్లిపోయాడని, మెమెంటోలు అందుకునేందుకు కూడా రాలేదని యూపీ జట్టు వర్గాలు తెలిపాయి.
క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్కు జట్టులో స్థానం లభించింది. అలాగే, తమిళనాడుకు చెందిన మురళీ విజయ్కు స్థానం కల్పించి సురేష్ రైనాను సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఛతేశ్వర్ పుజారాకు కూడా జట్టులో చోటు కల్పించారు. ఈ స్థితిలో రైనా తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పాలి.
ట్వంటీ20 ఫార్మాట్కు సురేష్ రైనాను కెప్టెన్గా నియమిస్తారనే ప్రచారం కూడా ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ట్వంటీ20 ఫార్మాట్లో సత్తా చాటుతున్న రైనా టెస్టుల్లో ప్రవేశం కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఏమైనా, మరో టెస్టు సిరీస్ వరకు రైనా ఆగాల్సిందేనా... ఏమో...