వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సురేష్ రైనా హర్టయ్యాడు, తిండి మానేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Suresh Raina
న్యూఢిల్లీ: ఇంగ్లాండుతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై సురేష్ రైనా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నిరాశను ఆయన తన చేతల ద్వారా కూడా చూపించాడు. సోమవారం భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో తన పేరు లేకపోవడంతో కలత చెందాడు. దాంతో రైనా మధ్యాహ్న భోజనం చేయలేదు. ఢిల్లీతో ఘజియాబాద్‌లో జరిగిన రంజీ మ్యాచ్‌లో స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్న సందర్భంగా ఉద్వాసన విషయం రైనాకు తెలిసిందే.

డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే రైనాకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడని, టెస్టు జట్టులో స్థానం దక్కనందుకు చాలా బాధపడ్డాడని, తనకు భోజనం చేయాలనిపించడంలేదని సహచరులకు చెప్పి గదిలోనే ఉండిపోయాడని, మ్యాచ్ విజయానంతరం వెంటనే మైదానం వీడి వెళ్లిపోయాడని, మెమెంటోలు అందుకునేందుకు కూడా రాలేదని యూపీ జట్టు వర్గాలు తెలిపాయి.

క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్‌కు జట్టులో స్థానం లభించింది. అలాగే, తమిళనాడుకు చెందిన మురళీ విజయ్‌కు స్థానం కల్పించి సురేష్ రైనాను సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఛతేశ్వర్ పుజారాకు కూడా జట్టులో చోటు కల్పించారు. ఈ స్థితిలో రైనా తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పాలి.

ట్వంటీ20 ఫార్మాట్‌కు సురేష్ రైనాను కెప్టెన్‌గా నియమిస్తారనే ప్రచారం కూడా ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ట్వంటీ20 ఫార్మాట్‌లో సత్తా చాటుతున్న రైనా టెస్టుల్లో ప్రవేశం కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఏమైనా, మరో టెస్టు సిరీస్ వరకు రైనా ఆగాల్సిందేనా... ఏమో...

English summary
Indian batsman Suresh Raina hurt for not selecting for test series to be held against England. He rejected lunch after Indian team selection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X