"కెసిఆర్కు తాబేదారు: లగడపాటికి పెయిడ్ అర్టిస్టు"
పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు అడుసుమిల్లి జయప్రకాష్ పెయిడ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారని, అటువంటి జయప్రకాష్ తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వసంత నాగేశ్వర రావు అన్నారు. తాను తాగి పారేసిన టీ గ్లాసుల ఖరీదు చేయని అడుసుమిల్లి జయప్రకాష్ తాను అమ్ముడుపోయానని ఆరోపించడం హేయమని ఆయన అన్నారు.
కెసిఆర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని కుంచికచర్లలో రూ. 10లక్షలు ఖర్చు చేసి జై ఆంధ్ర సభను వసంత నాగేశ్వర రావు నిర్వహించారని అడుసుమిల్లి జయప్రకాష్ ఆరోపించారు. వసంత నాగేశ్వరరావు 2009 డిసెంబర్ 9వ తేదీన నిమ్స్లో కెసిఆర్తో 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపారని ఆయన అన్నారు. తెరాస కండువా కప్పుకుని వసంత నాగేశ్వర రావు కెసిఆర్తో మంతనాలు జరిపారని ఆయన ఆరోపించారు.
ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలియని హీనులు స్క్రీప్టులు రాయించుకుని మీడియాలోనూ, వేదికలపైన మాట్లాడుతున్నారని వసంత నాగేశ్వరరావు అన్నారు. పొట్టి శ్రీరాములు పోరాటం చేసిన ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణ ప్రసక్తి లేదనే విషయాన్ని వారు తెలుసుకోవాలని ఆయన అన్నారు. కాకాని వెంకటరత్నం, తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న వంటి నాయకులు ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోరుతూ ఉద్యమాలు చేశారని గుర్తు చేస్తూ వారు కూడా చరిత్ర హీనులేనా అని వసంత నాగేశ్వర రావు అడిగారు. ఏమైనా, ఆంధ్రలో సమైక్యాంధ్ర, ప్ర్తత్యేకాంధ్ర నాయకుల మధ్య విభేదాలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.