స్పాట్ ఫిక్సింగ్: సురేష్ రైనాపై ఫోకస్?
చెన్నై సూపర్ కింగ్స్పై జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బౌలర్ ఆర్పీ సింగ్ నో బాల్ వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఆర్పీ సింగ్ నో బాల్ వేయడంతో కథ తిరగబడింది. అతను నో బాల్ వేయకుండా ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది.
తనతో 22 మంది క్రికెటర్లు టచ్లో ఉన్నట్లు బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. వారిలో దేశవిదేశాలకు చెందిన టాప్ క్రికెటర్లు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఏదో పేర్లు చెప్పినంత మాత్రాన క్రికెటర్లపై పడే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నట్లు కనిపించడం లేదు.
ఆటగాళ్లను పోలీసులు విచారించడం ప్రారంభిస్తే అంతా మసి మసి అయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్, కోలీపుడ్కు చెందిన ప్రముఖులు బెట్టింగ్ వ్యవహారంలో చేయి చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, క్రికెటర్ల పాత్రపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.