కమల్ హాసన్ 'పద్మ'కు 'విశ్వరూపం' టోపీ?
విశ్వరూపం సినిమాపై వివాదం చెలరేగడంతో ఎందుకొచ్చిన తంటా అనుకున్నారో ఏమో చివరి నిమిషంలో ఆయన పేరును కొట్టేశారట. మైనారిటీల మనోభావాలను దెబ్బ తీశారనే ఆరోపణపై విశ్వరూపం సినిమాను తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. హైదరాబాదు, బెంగళూర్ నగరాల్లో ఆ సినిమా శుక్రవారం విడుదల కాలేదు.
కమల్ హాసన్కు పద్మ భూషన్ అవార్డు ఇవ్వాలా, లేదా అనే డైలమాలో ప్రభుత్వం పడిందని, దానివల్లనే పద్మ అవార్డుల ప్రకటనలో జాప్యం జరిగిందని అంటున్నారు. కమల్ హాసన్కు ఇప్పటికే పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయనకు అత్యధిక ఉత్తమ నటుడి అవార్డులు వచ్చాయి. మొత్తం 24 మందికి పద్మ భూషన్ అవార్డులు ఇస్తే, అందులో 8 అవార్డులు కళారంగానికే వచ్చాయి. నటుడు రాజేష్ ఖన్నాకు, నటి షర్మిళా ఠాగోర్కు ఈ అవార్డులు వచ్చాయి.
కమల్ హాసన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం పద్మ భూషన్ అవార్డుకు నామినేట్ చేసింది. అయితే, చివరి నిమిషంలో ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం తుది జాబితా నుంచి తొలగించింది.