శ్రీశాంత్ రాహుల్ ద్రావిడ్తో గొడవ పడ్డాడా?
మరో విషయాన్ని కూడా ఆ పత్రిక రాసింది. అసలు శ్రీశాంత్ను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాం బయటకు పంపించేసిందట. అతని తంత్రాలతో విసిగి శ్రీశాంత్కు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి బయటకు పంపించేసినట్లు చెబుతున్నారు. దానివల్ల ఈ నెల 16వ తేదీన శ్రీశాంత్ ఉండడంలో అర్థమే లేదని అంటున్నారు.
మే 9వ తేదీన పంజాబ్తో మొహాలీలో జరిగిన మ్యాచులో శ్రీశాంత్తో ఆడించడం ద్రావిడ్కు ఇష్టం లేదట. కానీ, తుది జట్టులోకి రావడానికి శ్రీశాంత్ నానా ఎత్తులు వేశాడట. అలా వచ్చి టవల్ చుట్టుకుని బుక్కీ సూచనల మేరకు 13 పరుగులు ఇచ్చేసుకున్నాడు.
ముంబైతో ఈ నెల 15వ తేదీన జరిగిన మ్యాచునాటికి రాజస్థాన్ రాయల్స్ అతనితో తెగదెంపులు చేసుకుందట. అందువల్ల ముంబైలో 16వ తేదీన అతను ఉండాల్సిన అవసరమే లేదని అంటున్నారు. చెన్నైతో 12వ తేదీన మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీశాంత్కు ఉద్వాసన పలికినట్లు చెబుతున్నారు. జైపూర్లోని హోటల్ను ఖాళీ చేయాలని కూడా చెప్పారట.
కానీ, శ్రీశాంత్ ముంబైలోనే ఉండిపోయి పోలీసులకు చిక్కిపోయాడు. అయితే, స్పాట్ ఫిక్సింగ్ అనుమానాలు రాజస్థాన్ రాయల్స్కు రాలేదట గానీ శ్రీశాంత్ తంత్రాలతో విసిగిపోయి ఉద్వాసన పలికారట.