లిఫ్ట్లో ఇరుక్కుపోయిన మహారాష్ట్ర మాజీ సీఎం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శనివారం చావు దాకా వెళ్లి వచ్చారు. ముంబైలోని చర్చిగేటు వద్ద ఉన్న తన కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా ఆయన లిప్ట్లో ఇరుక్కుపోయారు.
ఏకంగా లిప్ట్లో 45 నిమిషాల పాటు ఆయన లిప్ట్లోనే ఉండిపోయారు. చివరకు మాహారాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి... ఆయన్ని సురక్షితంగా బయటకు తీశారు. మొదటి అంతస్థులోనే ఉన్న తన కార్యాలయానికి వెళ్లేందుకు చవాన్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ దత్తో కలిసి లిఫ్ట్ ఎక్కారు.
చవాన్ లిప్ట్లోకి ఎక్కిన కొద్ది సేపటికే సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా లిఫ్ట్ నిలిచిపోయింది. దీంతో చవాన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. లిఫ్ట్ను తెరిచేందుకు చవాన్తో పాటు ఆయన భద్రత సిబ్బంది చేసిన యత్నాలన్నీ విఫలమయ్యాయి.
చివరకు ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని లిఫ్ట్ను తెరిచారు. దీంతో మహారాష్ట్ర మాజీ సీఎం పృద్వీరాజ్ చవాన్ సురక్షితంగా బయటపడ్డారు.