కిరణ్ రెడ్డి స్టార్ బ్యాట్స్మన్ శైలజానాథ్
శుక్రవారం నాడు శాసనసభా సమావేశం శనివారానికి వాయిదా పడ్డిన తర్వాత సభ నుంచి ముఖ్యమంత్రి నవ్వుతూ కురిపిస్తూ బయటకు వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోని తన ఛాంబర్లోకి వెళ్లారు. ఆయన వెంట పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు.
శుక్రవారం నాడు శాసనసభలో మంత్రి సాకే శైలజానాథ్ బాగా మాట్లాడారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద వారు ప్రశంసించారు. దీనికి ముఖ్యమంత్రి కిరణ్ కూడా 'అవును బాగా మాట్లాడారు' అంటూ అన్నారు. ఆ తర్వాత ..సీఎం కిరణ్ సహచరులతో కలసి నవ్వుతూ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు.
ఈ సమయంలో మంత్రి శైలజానాథ్ కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురుపడ్డారు. 'బాగా మాట్లాడావు. కాని కొన్ని పాయింట్లు మరచి పోయావు' అని శైలజానాథ్ను అభినందిస్తున్నట్లుగా భుజం తట్టారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు - మంత్రి శైలజానాథ్ నైట్ వాచ్ మ్యానా అని ప్రశ్నించారు. దీనికి కిరణ్ సమాధానం ఇస్తూ .. 'కాదు .. మంత్రి శైలజానాథే మా మెయిన్ బ్యాట్స్మ్యాన్' అని వ్యాఖ్యానించారు.