కనుమూరికి క్లాస్: తిరుమలలో గవర్నర్ (పిక్చర్స్)
చిత్తూరు: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజుకు క్లాస్ పీకారు. తితిదేకు చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో నాణ్యమైన కార్యక్రమాలు ప్రసారం చేయలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం కొత్త ఏడాది ప్రారంభం రోజు కూడా నాణ్యమైన కార్యక్రమాలు లేవన్నారు.
కాగా, నరసింహన్ శుక్రవారం ఉదయం నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. బాపిరాజు స్వామి వారి తీర్థ ప్రసాదాలను, నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను గవర్నర్కు అందించారు.
అనంతరం గవర్నర్ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల నుండి నేరుగా తిరుచానూరు చేరుకున్న గవర్నర్ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. కాగా, గవర్నర్ అసంతృప్తిపై టిటిడి ఈవో మాట్లాడుతూ.. ఆ విషయాన్ని ఆయననే అడగాలని సూచించారు.
గవర్నర్ 1
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉదయం నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో పాల్గొన్నారు.
గవర్నర్ 2
అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. బాపిరాజు స్వామి వారి తీర్థ ప్రసాదాలను, నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను గవర్నర్కు అందించారు.
గవర్నర్ 3
అనంతరం గవర్నర్ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల నుండి నేరుగా తిరుచానూరు చేరుకున్న గవర్నర్ అధికారులు స్వాగతం పలికారు.
గవర్నర్ 4
ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. కాగా, గవర్నర్ అసంతృప్తిపై టిటిడి ఈవో మాట్లాడుతూ.. ఆ విషయాన్ని ఆయననే అడగాలని సూచించారు.
గవర్నర్ 5
గవర్నర్ నరసింహన్ దంపతులు శుక్రవారం ఉదయం నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో పాల్గొన్నారు.
గవర్నర్ 6
అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. బాపిరాజు స్వామి వారి తీర్థ ప్రసాదాలను, నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను గవర్నర్కు అందించారు.
గవర్నర్ 7
శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు, టిటిడి ఈవో తదితరుల దృశ్యం.