అందరిముందే అనుష్కతో కోహ్లీ: 'పీకే'పై... (పిక్చర్స్)
సిడ్నీ: భారత స్టార్ క్రికెటర్, టెస్టు పగ్గాలు పూర్తిస్థాయిలో చేపట్టబోతున్న విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి తిరిగే విషయంలో దాగుడుమూతలకు తెరదించాడు. తొలుత చాటుమాటున ఆమెతో తిరిగిన కోహ్లీ, అనంతరం ఆమెతో ఉన్న సంబంధం గురించి చెప్పాడు. ఇప్పుడు అనుష్కతో కలిసి తిరిగే విషయంలో జట్టు సభ్యులతో కలిసి వెళ్తున్నాడు.
సోమవారం సిడ్నీలో సహచరులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు తమ తమ భార్యలతో వచ్చారు. కోహ్లీకి తోడుగా అనుష్క శర్మ వచ్చింది. ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, కోహ్లీ, అనుష్క శర్మలు అభిమానులతో ఫోటోలు దిగితూ, ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఉత్సాహంగా గడిపారు.
పీకే చిత్రం చూసిన భారత జట్టు
భారత జట్టు ఆస్ట్రేలియాలో పీకే చిత్రాన్ని చూసింది. విరాట్ కోహ్లీ, ఇతర జట్టు సభ్యులు కలిసి చూశారు. ఆధ్యాత్మికంగా ఉత్తేజాన్ని ఇచ్చే సినిమా అని, అందరు అద్భుతంగా నటించారని, తీశారని కోహ్లీ కొనియాడాడు. విరాట్ కోహ్లీ ఈ సినిమా విషయంలో అనుష్క శర్మను ప్రత్యేకంగా పేర్కొనలేదు. అందరికి కితాబిచ్చాడు.