బాబు, కెసిఆర్ డుమ్మా: అలిగిన గవర్నర్ మనుమడు!
హైదరాబాద్: రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ 'ఎట్ హోం' విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడులు గైర్హాజరయ్యారు. దీంతో, గవర్నర్ నరసింహన్ మనవడు, మనవరాలి ఒకింత నిరుత్సాపడ్డారు.
ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ స్వయంగా చెప్పారు. తన మనవడు అలిగాడని చెప్పాడు. ఇద్దరు సీఎంలు వస్తే మా మనవడు, మనమరాలు వారితో ఫొటోలు దిగాలనుకున్నారని, వారు కొంత నిరుత్సాహపడ్డారని చెప్పారు.
ఇద్దరు సిఎంలు రాని కారణంగా లోటు ఏర్పడి, సమావేశానికి కళ తప్పిందా అని విలేకరులను గవర్నర్ నరసింహన్ ఎదురు ప్రశ్నించారు. సిపిఐ నేత నారాయణతోను ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ ఎట్ హోం
రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ 'ఎట్ హోం' విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడులు గైర్హాజరయ్యారు. దీంతో, గవర్నర్ నరసింహన్ మనవడు, మనవరాలి ఒకింత నిరుత్సాపడ్డారు.
గవర్నర్ ఎట్ హోం
ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ స్వయంగా చెప్పారు. తన మనవడు అలిగాడని చెప్పాడు. ఇద్దరు సీఎంలు వస్తే మా మనవడు, మనమరాలు వారితో ఫొటోలు దిగాలనుకున్నారని, వారు కొంత నిరుత్సాహపడ్డారని చెప్పారు.
గవర్నర్ ఎట్ హోం
ఇద్దరు సిఎంలు రాని కారణంగా లోటు ఏర్పడి, సమావేశానికి కళ తప్పిందా అని విలేకరులను గవర్నర్ నరసింహన్ ఎదురు ప్రశ్నించారు. సిపిఐ నేత నారాయణతోను ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ ఎట్ హోం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరికీ తాను ఆమోదయోగ్యుడినని, చివరి వరకు అలాగే ఉంటానని గవర్నర్ నరసింహన్ అన్నారు.
గవర్నర్ ఎట్ హోం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన రాజ్భవన్లో తేనీటి విందు ఇచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులకూ తాను కావాల్సిన వాడినేనని చెప్పారు.
గవర్నర్ ఎట్ హోం
తేనీటి విందుకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి వచ్చారు.
గవర్నర్ ఎట్ హోం
తెలంగాణ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు హాజరయ్యారు.
గవర్నర్ ఎట్ హోం
తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భాజపా శాసనసభాపక్ష నేత లక్ష్మణ్, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ తదితర ప్రముఖులు హాజరయ్యారు.