వరదలు: మోడీయే కాదు, మన్మోహన్ ఫోటో మార్ఫింగ్
న్యూఢిల్లీ: తమిళనాడు రాజధాని చెన్నైలో వరదల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల క్రితం విహంగ వీక్షణం చేశారు. ఈ సందర్భంగా ఫోటోషాప్లో మార్ఫింగా చేసిన ఏరియల్ సర్వే ఫోటో వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
దీని పైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) స్పందించింది కూడా. చెన్నైలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చాపర్లో కూర్చుని బయటి దృశ్యాలను పరిశీలిస్తున్న ఉన్న ఓ చిత్రాన్ని పిఐబి విడుదల చేసింది. ఈ ఫోటోలో బయటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే, ఈ ఫొటో ఒకటి అయితే, దానిలో అద్దం ఉన్న ప్రాంతంలో మరో వరద చిత్రాన్ని జోడించి, మార్ఫింగ్ చేసి బాగా కనిపిస్తుందనే ఉద్దేశంతో పిఐబి ఫోటోషాప్లో మార్పులు చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పశ్చాత్తాపం ప్రకటించింది.
అయితే, ఇలా పీఐబీ ఇలా చేయడం ఇదే మొదటిసారి మాత్రమే కాదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఇలాగే చేసింది. ఆ ఫొటోలు ఇప్పటికీ ఫోటోడివిజన్ వెబ్సైట్లో ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను ఒకే చిత్రంలో చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేశామని, ఇటువంటి చిత్రాలు చాలానే ఉన్నాయని పీఐబీ అధికారి ఒకరు తెలిపారు.