రివర్స్: మగాడిపై మహిళ లైంగిక వేధింపులు
చెన్నై: మహిళలను మగాళ్లు లైంగిక వేధించడం పరిపాటి. అటువంటి ఆరోపణలే వస్తుంటాయి. అయితే పాండిచ్చేరిలో దానికి విరుద్ధమైన సంఘటన జరిగింది. పాండిచ్చేరి నగరంలోని కిరుమంబాక్కం ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేటు స్వచ్చంద సంస్థలో నివసించే ఒక యువకుడిని లైంగికంగా వేధించిన కేసులో ఒక మహిళా ఉద్యోగిపై కేసు నమోదైంది.
ఈ కేసు వివరాలను ఈ విధంగా ఉన్నాయి - 2004లో సంభవించిన సునామీ ప్రళయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు అధిక సంఖ్యలో ఈ స్వచ్చంద సంస్థలో నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్న వారిలో ఓ యువకుడు రాత్రి వేళల్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళపోతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్వచ్చంద సంస్థ టైంకీపర్ ఆ విద్యార్థిని విచారించారు.
ఇదే స్వచ్చందగృహంలో ఉంటున్న ఒక మహిళా ఉద్యోగి లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఆమె రాత్రిపూట రహస్యంగా అతనిని తన గదికి తీసుకెళుతున్నట్టు వెల్లడైంది. దీంతో ఆ మహిళా ఉద్యోగినిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
గత ఏడాది కాలంగా ఆమె అతనితో లైంగిక వాంఛ తీర్చుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. శిశు సంక్షేమ కమిటీకి ఫిర్యాదును పంపించారు.