రజినీకాంత్తో చిదంబరం భేటీ: ఏం చర్చించారంటే..?
ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం కలిశారు.
చెన్నై: ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం కలిశారు. చెన్నైలోని రజినీకాంత్ ఇంటికి వచ్చిన చిదంబరానికి రజినీకాంత్ సాదరంగా స్వాగతం పలికారు.
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పెద్ద నోట్ల ప్రభావం గురించి వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. కాగా, రజినీకాంత్ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకీ ప్రత్యేకంగా మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం.
రజినీకాంత్ అంటే తమిళ ప్రజలు, నేతలు ఎంత అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ నాయకులు ఆయన కలుస్తుండటం గమనార్హం. ఇప్పటికే రాష్ట్ర బిజెపి నేతలు తరచూ ఆయనతో టచ్లో ఉంటున్నారు.
కాగా, తాజాగా రజినీకాంత్ను చిదంబరం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ ఆర్థిక పరిస్థితి, పెద్ద నోట్ల రద్దుతో ఎదురైన ఇబ్బందులు, ఆర్థికరంగంపై దాని ప్రభావం, తదితర అంశాలపై రజినీకాంత్తో చిదంబరం చర్చించినట్లు తెలిసింది.