వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రూ.500, 2000 నోట్ల ప్రింటింగ్ ఖర్చెంతో తెలుసా?

ఒక్కో కొత్త 500 రూపాయల నోటు ముద్రణకు రూ. 3.09పైసలు ఖర్చవుతున్నాయి. అదే 2000ల రూపాయల నోటుకు రూ. 3.54పైసలను ఆర్‌బీఐ ఖర్చు చేస్తోంది.

|
Google Oneindia TeluguNews

ఇండోర్‌: పెద్ద నోట్ల రద్దు అనంతరం భారత రిజర్వు బ్యాంక్ కొత్తగా రూ. 2000, 500ల నోట్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఒక్కో కొత్త 500 రూపాయల నోటు ముద్రణకు రూ. 3.09పైసలు ఖర్చవుతున్నాయి.

అదే 2000ల రూపాయల నోటుకు రూ. 3.54పైసలను ఆర్‌బీఐ ఖర్చు చేస్తోంది. భారతీయ రిజర్వు బ్యాంకు నోట్‌ ముద్రణ్ ప్రైయివేట్‌ లిమిటెడ్‌(బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌) ఈ నోట్లను ముద్రిస్తోంది.

For Rs 500 note, RBI pays Rs 3.09; Rs 3.54 for Rs 2,000 note

భారతీయ రిజర్వు బ్యాంకు అనుబంధంగా పనిచేసే బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌ ఈ వివరాలను వెల్లడించింది. నీముచ్‌కి చెందిన చంద్రశేఖర్‌ గౌడ్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను తెలియచేసింది.

500రూపాయల నోట్లు వెయ్యింటికి రూ.3,090లను, అదే సంఖ్యలో 2000 రూపాయల నోటుకు రూ.3,540లు ఛార్జి చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, నవంబర్ 8 రాత్రి కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్ల(రూ.500, 1000)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Bhartiya Reserve Bank Note Mudran Private Limited (BRBNMPL) is printing each new Rs 500 note at the old cost of Rs 3.09, while the cost of Rs 2,000 currency note is Rs 3.54.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X