హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోటో స్టోరీ: బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వొద్దు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరబాద్ నగరాన్ని యాచక రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నగరంలోని అన్ని స్వచ్చంధ సంస్ధల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, పోలీసులతో పాటు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొంటారని ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీఓస్ ఫర్ బెగ్గర్స్ ఫ్రీ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ జి.రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని తెలిపారు.

Hyderabad

నగరంలోని వివిధ కూడళ్లలో యాచకవృత్తి నివారణ ప్రచారోద్యమం, నిజమైన యాచకులకు పునరావాస కార్యక్రమాలు, యాచకులకు డబ్బులు దానం చేయకుండా నగర పౌరుల్లో అవగాహన కల్పించడం తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొనే స్వచ్చంధ సంస్ధలు 9908111355, 9866289793, 9441256545 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేదా [email protected] మెయిల్‌కు వివరాలను పంపించాలని సూచించారు.

హైదరబాద్ మహానగరంలో దాదాపు 14 వేల మంది యాచకులు ఉన్నట్లు ఈ సంస్ధ నిర్వహించిన సర్వేలో తేలింది. నగరంలోని ఈ 14వేల మందికి ప్రతి ఏటా రూ. 24 కోట్లను నగర పౌరులు దానం చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
GHMC announced 'Gaurav Sadans', shelters for thousands of beggars in the city.There are an estimated 2,000 beggars across 100 traffic junctions in the city, according to officials who are conducting a survey to verify the total number.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X