అచ్చు అమ్మలాగానే , 68 కిలోలతో ఆమె ఇష్షపడే ఇడ్లీ తయారీ
చెన్నై :జయలలిత మరణించిన రెండు వారాలు దాటుతున్నా అభిమానులు మాత్రం ఇంకా ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఆమె సమాధి వద్ద ప్రతిరోజు వందలాది మంది వచ్చి నివాళులర్పిస్తున్నారు. ఏదో ఒక రకమైన కార్యక్రమాలతో అభిమానులు ఆమె పట్ల అభిమానాన్ని చూపిస్తున్నారు.
జయలలితకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఆమె ఎక్కువగా టిపిన్ లో ఇడ్లీనే తీసుకొనేవారు. అయితే ఆమె అభిమానులు ఇంకా ఆమెను మరిచిపోలేకపోతున్నారు. అందుకే ఆమె చనిపోయినా ఆమె పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకొనేందుకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు.
జయలలితను ఖననం చేసిన మెరీనా బీచ్ వద్ద ఆమె అభిమానులు 68 కిలోల ఇడ్లీని తయారు చేసి ఆమె సమాధి వద్ద ఉంచారు. ఆమె వయస్సు ను సూచించేలా 68 కిలోలతో ఈ ఇడ్లీని తయారు చేశారు.
జయలలిత ముఖం ప్రతిబింబించేలా ఈ ఇడ్లీని తయారు చేశారు. ఆమె వయస్సు 68 ని తెలిపేలా 68 కిలోలతో ఈ ఇడ్లీని తయారు చేశారు. అమ్మ అంటే తమిళ ప్రజలకు ఉన్న అభిమానం ఇంకా మరిచిపోలేక పోతున్నారు. అందుకే వారు ప్రతిరోజూ ఏదో రకమైన కార్యక్రమాలను తీసుకొంటూ తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు.