వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేడివేడి నూనెలో నుంచి చేత్తో వడలు తీసిన భక్తుడు
చెన్నై: భక్తులు మొక్కులుగా తలనీలాలు సమర్పిస్తారు. కాలి నడకన సుదూర ప్రయాణం చేస్తారు. దేవుడికి మొక్కుకొనే భక్తులు.. తాము ఏ మొక్కు మొక్కుకుంటే దానిని తీర్చుకుంటారు. అయితే, తమిళనాడులో ఓ భక్తుడు మాత్రం తాను తీర్చుకున్న మొక్కు షాకింగ్కు గురి చేస్తోంది.
అతను సలసల కాగే వేడి నూనెలో ఉన్న వడలను చేతులతో తీసి, అమ్మవారికి తన మొక్కును చెల్లించుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూర్ బిల్లాలితొట్టి గ్రామంలోని ముత్తుమారి యమ్మన ఆలయ ఉత్సవాల్లో కనిపించింది.
ఆరు రోజుల నుంచి ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయంలో ప్రతి రోజు అభిషేకం, ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఓ భక్తుడు తన మొక్కును తీర్చుకున్నాడు. భక్తులందరూ అమ్మవారి నామాలను పఠిస్తూ ఉండగా వేడి నూనెలో నుంచి చేతులతో వడలు తీశాడు. అనంతరం వాటిని అమ్మవారికి నైవేధ్యంగా సమర్పించాడు.
Comments
English summary
muthumariamman temple devotee hand made from boiling.
Story first published: Monday, August 8, 2016, 10:49 [IST]