‘కుక్క చావు చచ్చిన..’: జగన్పై మహా టీవీ బ్లండర్ మిస్టేక్, ఘాటు విమర్శలు
మహాటీవీ చేసిన బ్లండర్ మిస్టేక్పై సోషల్ మీడియా వేదికగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
హైదరాబాద్: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానళ్లలో ఒకటైన మహా టీవీలో ఓ పెద్ద తప్పు జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం ఆమెకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఆమె అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, వైయస్ జగన్.. జయ మృతికి సంతాపం తెలిపిన విషయాన్ని మహా టీవీలో చాలా పెద్ద తప్పుగా బ్రేకింగ్ ఇచ్చింది. 'జగన్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం' అని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. ఇది చూసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా మహా టీవీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి ఫొటో పెట్టి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, మహా టీవీ ఛానల్ ఆ బ్రేకింగ్ న్యూస్ కావాలని చేసింది కాదని, పొరపాటుగానే జరిగిందని తెలుస్తోంది.
క్షమాపణ చెప్పిన మహా న్యూస్ ఛానల్
తమ న్యూస్ ఛానల్లో జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరింది మహా న్యూస్ ఛానల్. తాము కావాలని చేయలేదని, పొరపాటు వల్లే ఈ పెద్ద తప్పు జరిగిందని పేర్కొంది. తమకు ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేసింది. తమ ఈ తప్పును మన్నించాలని కోరింది.