నిన్న చిరంజీవికి తగ్గారు, నేడు పవన్కళ్యాణ్కి చేదు
చిత్తూరు: సొంత లేదా ఇతర హీరోల అభిమానుల వల్ల గతంలో 'అన్నయ్య' చిరంజీవికి, నేడు 'తమ్ముడు' పవన్ కళ్యాణ్కు చేదు అనుభవం మిగిల్చింది. గతంలో చిరంజీవి సొంత అభిమాని వల్ల ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పవన్కు మరో హీరో అభిమాని వల్ల చేదు ఎదురైంది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో.. చాలామంది ఆ పార్టీలో చేరారు. హీరో రాజశేఖర్, జీవిత దంపతులను కూడా మీడియా ప్రశ్నించింది. మీరు ప్రజారాజ్యంలో చేరుతారా అని ప్రశ్నించింది. దానికి వాళ్లు.. కొత్త పార్టీల్లో చేరమని, పేరున్న పార్టీలోకే వెళ్తామన్నారు.
వారి వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన చిరంజీవి అభిమానులు.. రాజశేఖర్ కారు పైన రాళ్లు రువ్వారు. అతని కారును వెంబడించారు కూడా. అభిమానుల అత్యుత్సాహానికి చిరంజీవి.. రాజశేఖర్ ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు, ఓ హీరో అభిమాని ఆవేశంలో పవన్ అభిమానిని కత్తితో పొడవడం వల్ల చనిపోయాడు.
అభిమానం ఉండవచ్చు. కానీ అత్యుత్సాహం, దురభిమానం సరికాదని పవన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. చంపుకునే స్థాయిలో అభిమానం సరికాదని, మేమంతా (హీరోలం అందరం) స్నేహంగా ఉన్నామని చెప్పారు.
మెగా బ్రదర్స్
సొంత లేదా ఇతర హీరోల అభిమానుల వల్ల గతంలో 'అన్నయ్య' చిరంజీవికి, నేడు 'తమ్ముడు' పవన్ కళ్యాణ్కు చేదు అనుభవం మిగిల్చింది. గతంలో చిరంజీవి సొంత అభిమాని వల్ల ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పవన్కు మరో హీరో అభిమాని వల్ల చేదు ఎదురైంది.
ఓదార్పు
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు చిత్తూరు జిల్లా తిరుపతిలో తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఓదార్పు
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు చిత్తూరు జిల్లా తిరుపతిలో తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించారు. వినోద్ తల్లిని ఓదారుస్తున్న పవన్.
శ్రీవారి దర్శనం
కర్ణాటకలో ఇటీవల హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునన్నారు.